ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ: సంజయ్ రౌత్
By Somaraju 64చూసినవారులోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రధాని మోదీ ఉల్లంఘిస్తున్నారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. పార్టీ తరపున ప్రచారం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వ వనరులను ఉపయోగిస్తే ఆ బిల్లులను బీజేపీ నుంచి ఈసీ వసూలు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ విమానాన్ని ప్రధాని తన పర్యటనలకు ఉపయోగిస్తున్నారని, ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత కొద్దిరోజులుగా మోదీ ప్రభుత్వ హెలికాప్టర్లలో వెళుతున్నారని ఆరోపించారు.