మోదీ ధ్యానం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే: విపక్షాలు

62చూసినవారు
మోదీ ధ్యానం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే: విపక్షాలు
కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చివరి దశ పోలింగ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని మండిపడ్డారు. ఈ కార్యక్రమాన్ని టీవీ, ఇతర మీడియాల్లో ప్రసారం చేయకుండా ఆపాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు ఈసీని కోరాయి. కావాలంటే జూన్ 1 సాయంత్రం నుంచి ధ్యానం చేయాలి. ప్రధానమంత్రి కార్యక్రమంపై ఎలాంటి నిషేధం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్