లోక్సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్పై సెటైర్ల వర్షం కురిపించారు. 99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు సంతోషపడుతున్నాడని.. కానీ ఆ మార్కులు 100కి కాదు, 543కి వచ్చాయని ఎద్దేవా చేశారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్కు సున్నా సీట్లు వచ్చాయని.. సున్నా సీట్లు వచ్చినా కాంగ్రెస్ వాళ్లు హీరోల్లా ఫీల్ అవుతున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఫేస్ టు ఫేస్ పోరులో కాంగ్రెస్ స్ట్రైక్రేట్ 26 శాతం మాత్రమేనంటూ దుయ్యబట్టారు.