సీఎం జగన్‌పై దాడి.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

58చూసినవారు
సీఎం జగన్‌పై దాడి.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
విజయవాడలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎం జగన్‌పై దాడి కేసులో పోలీసులు దుర్గారావును తీసుకెళ్లారంటూ.. అతడిని చూపించాలంటూ భార్య, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేనందుకే అతడిని దాచిపెట్టారని భార్య ఆరోపించారు.

సంబంధిత పోస్ట్