వైఎస్సార్ జిల్లా చెన్నూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. చెన్నూరుకి చెందిన ఉమామహేశ్వరి అనే మహిళ భర్తతో గొడవల కారణంగా పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. గొడవలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఉమామహేశ్వరి, ఆమె కుమారుడు, కుమార్తె వల్లూరు మండల కేంద్రంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.