ప్రభుత్వ సిబ్బంది ఉన్నా పెన్షన్లను ఇళ్ల వద్దే ఎందుకు ఇవ్వలేకపోతున్నారని
వైసీపీ సర్కార్ను చంద్రబాబు నిలదీశారు. "ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో
వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోంది. పెన్షన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు. ఫోన్లు లేని వారికి నగదు పడిందో? లేదో? అని ఎలా తెలుస్తుంది? ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశాం." అని చంద్రబాబు పేర్కొన్నారు.