ఎన్డీయే హయాంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణాలన్నీ కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు, జబల్పూర్ ఎయిర్పోర్ట్ రూఫ్ కూలిందని, రాజ్కోట్ ఎయిర్పోర్ట్ కనోపీ ధ్వంసమైందని వివరించారు. ఎన్డీయే హయాంలో నిర్మించిన అయోధ్యలోని రామ్ మందిర్లో లీకేజీలు, ముంబై హార్బర్ లింక్ రోడ్డులో పగుళ్లు రాగా, బిహార్లో 3 వంతెనలు కుప్పకూలాయని తెలిపారు.