మంత్రాల నెపంతో వ్యక్తి హత్య

60చూసినవారు
మంత్రాల నెపంతో వ్యక్తి హత్య
TG: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో మల్లం యాకయ్య అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి రాజు అనే యువకుడు దారుణంగా కొట్టి చంపాడు. స్థానికులు వెంటనే రాజును తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్