ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. జైలులో నూడుల్స్ కావాలని నిందితుడు డిమాండ్

66చూసినవారు
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. జైలులో నూడుల్స్ కావాలని నిందితుడు డిమాండ్
కోల్‌కతాలోని RG కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్ ప్రస్తుతం జైలులో ఉంటున్నాడు. అతడికి ఆహారంగా రోటీ, సబ్జీని జైలు అధికారులు ఇస్తున్నారు. సంజయ్ వాటిని నిరాకరిస్తున్నట్లు సమాచారం. తనకు ఎగ్ నూడుల్స్ కావాలని నిందితుడు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అడిగింది ఇవ్వడం కుదరదని జైలు అధికారులు స్పష్టం చేయడంతో నిందితుడు సైలెంట్ అయ్యాడని జాతీయ మీడియా పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్