మద్దిమడుగు హనుమాన్ జయంతి వేడుకలు

864చూసినవారు
మద్దిమడుగు హనుమాన్ జయంతి వేడుకలు
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల పరిధిలోని మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయం స్వామి హనుమాన్ జయంతి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3రోజుల పాటు జరిగిన వేడుకలలో భాగంగా ఆలయ చైర్మన్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో హనుమాన్ మహా యజ్ఞం, 108 కళాశాలతో పూజ, సీత రాముల కల్యాణం వైభవంగా జరిగాయి. అదేవిధంగా ఈ వేడుకలకు అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ దంపతులు హాజరై ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయం తరుపున శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రామశర్మ, జూనియర్ అసిస్టెంట్ జైపాల్ రెడ్డి, అర్చకులు, వీరయ్య గారి బృందం, ఆలయ డైరెక్టర్లు అంజి రెడ్డి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్