మైలారం శివారులో మహిళ శవం లభ్యం
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం పరిధిలోని మైలారం గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ శవం కుళ్ళిపోయిన స్థితిలో బుధవారం లభించింది. పదిరోజుల క్రితం ఈ మహిళ మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుమారుగా 40 సంవత్సరాల వయసు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మహిళ శవాన్ని గుర్తిస్తే బల్మూరు ఎస్ఐ 8712657736, అచ్చంపేట సీఐ 8712657731, అచ్చంపేట డిఎస్పి 8712657730 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.