పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం డిండిలో జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బలం బలగం కార్యకర్తలేనని వారు అన్నారు. అనంతరం దేవరకొండలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.