మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తేరేట్ పల్లి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పై అవగాహన కల్పించారు. క్యాన్సర్ వ్యాధి కారకాలు, నివారణపై విద్యార్థులకు చక్కగా వివరించారు. వారు మాట్లాడుతూ వ్యాధుల పట్ల అప్రమత్తత, అవగాహన కలిగి ఉంటే ఆ వ్యాధిని ఆదిలోనే అరికట్ట వచ్చని, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పొగాకు, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు.