మిర్యాలగూడ మండలంలోని ఉట్లపల్లి గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో స్థానిక డా. బీవీఆర్ ఫౌండేషన్, మేధ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంగ్యా నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాలను మెరుగు పరచుకుంటెనే ఈ పోటీ ప్రపంచంలో రాణిస్తారని అన్నారు.