ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు

64చూసినవారు
ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు
నల్గొండ- ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 585పోలింగ్ బూత్ లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకున్నట్లు తెలిపారు. ఓటు వినియోగించుకున్న వారిలో రవీందర్ గాదేపాక, దేవేంద్రమణి ఉన్నారు.