మునుగోడు: ఒకే చోట అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాలు

85చూసినవారు
మునుగోడు నియోజకవర్గ కేంద్రం లో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో పలు ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ దాని ముందే ఉన్న అంగడి ప్రదేశం, పోలీస్ స్టేషన్ భవనం, మునుగోడు ఎస్సీ బాలుర వసతి గృహ భవనం, ఒకేచోట అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేలా వాటికి అవసరమయ్యే స్థలం అన్నింటినీ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్