నల్గొండ శాలీగౌరారం మండలం వల్లాల గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వాలుగొండ భిక్షం ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అతడు రోజు ఉదయాన్నే ఇడ్లిలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇది గమనించిన వల్లాల గ్రామ కిశోరన్న యువసైన్యం సభ్యులు తమవంతు సహాయంగా ఐదువేల రూపాయలు అందజేశారు. ఈకార్యక్రమంలో సట్టు సైదులు, ఎడ్ల వెంకట్ రెడ్డి, భూపతి ఉపేందర్, టీఆరెస్ గ్రామశాఖ కార్యదర్శి భూపతి నాగరాజు, భూపతి శంకర్, భూపతి సైదులు, భూపతి మహేష్ లు పాల్గొన్నారు.