నల్గొండ పట్టణ సమీపంలోని అని శెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకై ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దాసరి చందన ఆదివారం తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు కు ఏర్పాటు చేసే టేబుళ్లు , బ్యారీకేడింగ్, ఏజెంట్లు బ్యారేడింగ్ , భద్రత, తదితరాలను పరిశీలించారు. అంతేకాక ఓట్ల లెక్కింపుకు అధికారులందరూ అక్కడే ఉండి బస చేసేందుకు వసతి చూడాలని ఆదేశించారు.