అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 2025 నాటికి ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక శక్తిగా భారత్ నిలువనుందని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అంచనా వేశారు. స్థూల ఆర్థిక సూచీల సానుకూలతలను చూస్తుంటే వచ్చే ఏడాదిలోనే జపాన్ను అధిగమిస్తుందన్నారు. ప్రస్తుతం మన దేశ జీడీపీ 3.7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా.