గేదెను ఢీకొట్టిన బైక్
By shobha 2953చూసినవారుఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని నసీంపేట శివారులో శనివారం రాత్రి గేదెను బైక్ తో ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాకేశ్, దేశగాని చందు సూర్యాపేటలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష రాసి ఏపూర్ వైపు వెళుతుండగా నసీం పేట వద్ద గేదెను ఢీ కొట్టడంతో రోడ్డుపై ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో చందు (20) అక్కడికక్కడే మృతిచెందగా, రాకేశ్కు తీవ్రగాయాలయ్యాయి.