1956లో ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నీలం సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందే ఆయనకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, ఎన్జీ రంగా నేతృత్వంలోని కృషికార్ లోక్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో బెజవాడ గోపాల్ రెడ్డికి అవకాశం దక్కింది. ఆయన అనంతరం 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా సంజీవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.