రేపు జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్టీయే (NTA) ప్రకటించింది. త్వరలో కొత్త తేదీని వెల్లడిస్తామని పేర్కొంది. ఇటీవల నీట్ యూజీ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో ఎన్టీయే డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ ను కేంద్రం ఇవాళ పదవి నుంచి తొలగించింది.