ఖానాపూర్ లో మహిళ దారుణ హత్య
ఖానాపూర్ పట్టణంలోని శివాజీ నగర్ ప్రధాన రహదారిపై ఒక మహిళ దారుణ హత్య కలకలం రేపింది. గురువారం ఒక మహిళ శివాజీ నగర్ లోని ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స నిమిత్తం ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. ఖానాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటన వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.