నిర్మల్ జిల్లాల్లో కేంద్రంలో నిర్వహించిన కరాటే పోటీలలో కడెం మండలంలోని లింగాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలిచారు. జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీలలో ఆ పాఠశాల సాహితీ బంగారు పతకం, ఝాన్సీ, అక్షయ, మేఘన కాంస్య పతకాలను సాధించారు. వారిని ఆదివారం సాయంత్రం ఆ పాఠశాల హెచ్ఎం, నిర్వాహకులు ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.