పెద్దమ్మ తల్లి దేవాలయంలో దొంగతనం

551చూసినవారు
పెద్దమ్మ తల్లి దేవాలయంలో దొంగతనం
కడెం మండలంలోని సింగాపూర్ గ్రామంలో ఉన్న పెద్దమ్మతల్లి దేవాలయంలో దొంగతనం జరిగిందని కడెం మండల కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయం తలుపులను పగలగొట్టి అక్కడున్న రెండు హుండీలను ధ్వంసం చేశారన్నారు. ఆ హుండీలలో ఉన్న రూ 3000 గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారన్నారు. దేవాలయ పూజారి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :