భైంసా: ఆటో బైక్ ఢీ పలువురికి గాయాలు

79చూసినవారు
ఆటో బైక్ ఢీకొని పలువురికి గాయాలైన ఘటన మంగళవారం భైంసాలో చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం భైంసా మండలం మిర్జాపూర్ గ్రామ కూలీలు బాసర మండలం బిద్రేల్లి కి కూలి పనికి వెళ్లి వస్తుండగా భైంసా నుండి దేగాం వైపు వెళుతున్న బైక్ ఎదురుగా వస్తున్న ఆటోను పట్టణ సమీపంలో ఢీ కొనగా ఆటో బోల్తా పడింది. బైక్ ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్