బాసరలో దేవాదాయ శాఖ కమిషనర్ కృష్ణవేణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆలయంలో లడ్డూ, పులిహోర స్టోర్, అద్దె గృహాలు, అక్షరాభ్యాస టికెట్ల గోల్ మాల్ పై విచారణ జరిపినట్లు పేర్కొన్నారు. ఇటీవల మీడియాలో కథనాలు రావడంతో స్పందించి తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఆహార పదార్థాలు, పులిహోర, లడ్డూ నాణ్యతను పరిశీలించారు.