నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద నుండి బైక్ పై భారీగా గంజాయి తరలిస్తున్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ కు చెందిన జిలకర ప్రసాద్, విద్యాసాగర్ లను ఆర్మూర్ రూరల్ పోలీసులు బుధవారం పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై రాహుల్ మూడున్నర కిలోల గంజాయిని పట్టుకున్నారు.