బోధన్: దుర్గామాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం

52చూసినవారు
బోధన్: దుర్గామాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 16వ వార్డ్ రంగర్ గల్లీలో గల కోట మైసమ్మ ఆలయంలో శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా నెలకొల్పిన అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అధ్యక్షులు విష్ణు, కార్యదర్శి ఆకాష్, కోశాధికారి సతీష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్