ఈదురు గాలులతో ధర్మారం ఎ గ్రామంలో ధ్వంసమైన ఇండ్లు

4511చూసినవారు
ఈదురు గాలులతో ధర్మారం ఎ గ్రామంలో ధ్వంసమైన ఇండ్లు
ఈదురు గాలులతో వర్షం భారీ ఎత్తున కురియడంతో నవీపేట్ మండలం ధర్మారం ఎ గ్రామంలో రేకులతో ఉన్న ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఇండ్లపై ఉన్న రేకులు గాలిలో ఎగిరిపడ్డాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలు రాత్రింబవళ్లు నిద్రలేని సమయం గడిపారు. ఆర్ఐ నరేష్, కార్యదర్శి సునీత శనివారం కూలిన ఇండ్లను పరిశీలించారు. నష్టం విషయంలో నివేదికలను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.