విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి

68చూసినవారు
విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి
బోధన్ తనకాలన్ శివారులోని పంట పొలాల్లో గోపూరి పోశెట్టి అనే కౌలు రైతు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణ రెడ్డి సోమవారం తెలిపారు. పంట చేలను పందుల భారీ నుండి కాపాడడానికి అమర్చిన విద్యుత్ తీగ తీయడానికి వెళ్ళిన పోశెట్టి అక్కడే జారి వైరు మీద పడి షాక్ తగిలి మరణించినట్టు ఎస్సై తెలిపారు. పోశెట్టి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్