ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13 న జరుగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో కలిసి సమావేశం నిర్వహించారు.