తండ్రి లేక బాలిక సూసైడ్
నిజామాబాద్ జిల్లాలోని ఏడపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మేఘన(14) అనే బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 4 నెలల కిందట తండ్రి శ్రీనివాస్ చనిపోయిన నుంచి మానసిక ఆందోళనకు గురవుతూ పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తూ ఉంటున్నట్లు తెలుస్తోంది. తండ్రి లేడని ఆందోళన చెందుతూ సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.