జైలు తిండి పడట్లేదు.. ఇంటి భోజనం కావాలి: దర్శన్‌

1076చూసినవారు
జైలు తిండి పడట్లేదు.. ఇంటి భోజనం కావాలి: దర్శన్‌
రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్‌ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. తనకు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇప్పించాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే ఇందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కౌంటర్‌ దాఖలు చేశారు. దర్శన్, నటి పవిత్రగౌడ, ఇతర నిందితులకు జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్