ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఎంత హాట్ టాపిక్ అవుతుందో మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వీరిపై ఏ నిర్ణయం తీసుకోబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నికలకు ముందు రాజీనామాలు చేసిన వాలంటీర్లను ఉద్యోగాల్లోకి తీసుకోని ప్రభుత్వం.. వాలంటీర్లుగా కొనసాగుతున్న దాదాపు లక్షన్నర మందితో ఏ పని చేయించకుండా జీతాలివ్వటానికి సిద్ధమైంది. వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పిస్తున్నారు. దీంతో కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే నెలల్లో ఇలా ఎంతమంది వెళ్లిపోతారో చూసి ఆ తర్వాత ప్రభుత్వం వాలంటీర్లపై తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.