రక్తనాళం దొరక్కపోవడంతో మరణశిక్ష నిలిచిపోయిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ప్రాణాంతక ఇం
జెక్షన్ ఇచ్చేందుకు వైద్య బృందం అనేక సార్లు ప్రయత్నించారట. అయినప్పటికీ ఖైదీ రక్తనాళం కనుక్కోవడంలో విఫలమయ్యారు. దీంతో చేసేదేమీ లేక మరణశిక్షను నిలిపివేశారు. అమెరికాకు చెందిన థామస్ యూజీన్ క్రీచ్ (73).. ఓ సీరియల్ కిల్లర్. మూడు రాష్ట్రాల్లో ఐదు హత్యలకు పాల్పడ్డాడు. అనేక కేసుల్లో అనుమానితుడిగా ఉన్నాడు.