ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కస్టడీ ద్వారా కీలక విషయాల్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రధాన పాత్రధారులెవరనేది దాదాపుగా నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్రావు పోలీస్ అధికారులతో పాటు పలువురు నేతల పేర్లు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ నేతలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు నేతలకు నేడో, రేపో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.