నందమూరి ఫ్యామిలీ నుండి మరో వారసుడు రాబోతున్నారు. హరికృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా మరో ఎన్టీఆర్ తెలుగు తెరకి పరిచయం కాబోతున్నాడు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్ కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకి ఇద్దరు కుమారులు ఉండగా, ఓ కుమారుడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నేడు ఈ మూవీ ఓపెనింగ్ జరగనుంది. ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.