పారిస్ ఒలింపిక్స్ 2024 వేడుకలు మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఓపెనింగ్ పరేడ్ను అథ్లెటిక్స్ స్టేడియాల్లో కాకుండా.. పారిస్లోని సియోన్ రివర్పై నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లే చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాదాపు 3వేల మంది డ్యాన్సర్లు, సింగర్లు 12 విభాగాలుగా విడిపోయి ఎంటర్టైన్ చేయనున్నారు. ఇక తొలిసారి స్టేడియం ఆవల ఓపెనింగ్ కార్యక్రమాలు జరగనుడటం గమనార్హం.