తెలంగాణలో సమగ్ర కులగణనపై ఉత్తర్వులు జారీ

79చూసినవారు
తెలంగాణలో సమగ్ర కులగణనపై ఉత్తర్వులు జారీ
తెలంగాణలో సమగ్ర కులగణన, ఇంటింటికి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో ప్రకారం సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సమస్యలపై సర్వే నిర్వహించనున్నారు. సర్వే బాధ్యతను రాష్ట్ర ప్రణాళికా విభాగానికి అప్పగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్