హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్

54చూసినవారు
హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్
హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాల తర్వాత శాసనసభను ప్రొరోగ్‌ చేసిన నేపథ్యంలో ఆర్డినెన్స్‌ల జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ వివరించారు. పది రోజుల్లో ముసాయిదాను సిద్ధం చేసేందుకు అధికారులు పని చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కారు ప్రవేశ పెట్టనుంది.

సంబంధిత పోస్ట్