నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

84చూసినవారు
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
భారత 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం అయ్యాక, ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. జూన్ 27న ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

సంబంధిత పోస్ట్