జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఏపీ సెక్రటేరియట్లో ఛాంబర్ కేటాయించారు. సచివాలయం రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212వ రూమ్ను పవన్కు అప్పగించనున్నారు. ఈ రూమ్లోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక పవన్తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్కు కూడా అదే అంతస్తులో పక్కనే వరుస రూములను కేటాయించారు.