నేడు రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం

54చూసినవారు
నేడు రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికలు, ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే సభ ఏర్పాట్లు, ఎంపీ స్థానాలు, 100 రోజుల పాలన వంటి అంశాలపై చర్చించనున్నారు. తుక్కుగూడ సభలో 5 గ్యారంటీలను ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ ఇప్పటికే వెల్లడించారు. ఈ సభకు రాహుల్ గాంధీ, ఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్