HYD పాతబస్తీ పరిధి ఆసిఫ్ నగర్ పిఎస్ లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగి 50 వాహనాలు కాలిపోయిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పక్కన గల్లీలో జరిగిన పెళ్లి బరాత్ లో పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. దీంతో నిప్పు రవ్వలు ఎగిసిపడి PS ఆవరణలో సీజ్ చేసి ఉన్న వాహనాలపై పడ్డాయి. ఈ క్రమంలో మంటలు అంటుకొని 50 వాహనాలు కాలిపోయాయి. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.