మహదేవ్ పూర్ నుండి కాటారం రహదారిలో మంగళవారం సాయంత్రం ఓ బైక్ పై దంపతులు వారి చిన్న పాపతో కలిసి వెళ్తుండగా, బైక్ అదుపుతప్పి కిందపడటంతో దంపతులతో పాటు చిన్న పాపకు గాయాలయ్యాయి. అదే దారిలో వెళ్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గాయలైన వారిని గమనించి, తన వాహనాన్ని ఆపి, విషయం తెలుసుకొని వెంటనే వారిని మరో ప్రత్యేక వాహనంలో హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించాలని పోలీసులకు సూచించారు.