ఐపీఎల్ లో బాగంగా రాజస్థాన్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్కతా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోల్కతా నైట్ రైడర్స్
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇదే మొదటి
సారి కాబట్టి అయ్యర్ కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానాతో సరిపెట్టారు.