ప్రధాని మోదీపై కేంద్ర మాజీమంత్రి, ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీకి వ్యతిరేకంగా ప్రజల మూడ్ ఇప్పుడు మారిందని అన్నారు. చిన్న చిన్న అంశాలపై దృష్టి సారిస్తున్నారని, కానీ వేలాది చదరపు కిలో మీటర్ల భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకోవడంపై ఆయన మౌనంగా ఉన్నారని ఆరోపించారు. కానీ ఇందిరాగాంధీపై విమర్శలు చేస్తున్నారన్నారు. జాతి ప్రయోజనాలపై ఆయన నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు.