వ్యభిచార గృహాన్ని నడిపేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమిళనాడుకు చెందిన రాజా మురుగన్ అనే న్యాయవాది హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనిని చూసిన హైకోర్టు షాక్కు గురైంది. సదరు పిటిషనర్పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ను రద్దు చేయడమే కాకుండా, అతడికి రూ.10 వేల జరిమానా కూడా విధించింది.