రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని
బీజేపీ, జేడీఎస్ గగ్గోలు పెడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసన చేపట్టారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.
మోదీ ప్రధాని కాగానే పెట్రోల్ ధరలను లీటర్కు రూ.72 నుంచి రూ.104కు, డీజిల్ ధరలను రూ.58 నుంచి రూ.92కు పెంచారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా కూడా
మోదీ ప్రభుత్వం పెట్రో ధరలను పెంచి ప్రజలపై భారాలు మోపిందని దుయ్యబట్టారు.